Wednesday, October 19, 2016

బిజెపి నేత పుత్రరత్నం ఘనకార్యం

సాముహిక అత్యాచారంలో బిజెపి నేత కుమారుడు


పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్న 36 ఏళ్ల వివాహితపై బీజేపీ నాయకుడు కుమారుడు సహా మరో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తున్న 36 ఏళ్ల వివాహిత దసరా పండగ సందర్భంగా పిర్దా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రివేళ ముగ్గురు యువకులు కారులో వచ్చి మహిళను బలవంతంగా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపారని పోలీసులు చెప్పారు. అత్యాచారాన్ని ఆ మహిళ అడ్డుకోవడంతో ఓ రాడ్ తో ఆమె మర్మాంగాన్ని గాయపర్చారు. ఆపై గ్యాంగ్ రేప్ చేస్తూ, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ తో వీడియో తీశారు. సంఘటన గురించి పోలీసులకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన ప్రిన్స్ సలూజా(23), దేవేంద్ర (23), ఫరీద్ అలీ(25)లను అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రిన్స్ సలూజా బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్ కుమారుడని పోలీసులు చెప్పారు.

No comments:

Post a Comment