Wednesday, October 19, 2016

మిత్రుడిని హతమార్చాడు ... ఉరికంభం ఎక్కుతున్నాడు...

మిత్రుడు హత్యకేసులో సౌది రాజకుటుంబ సభ్యుడికి ఉరి


ఓ హత్య కేసులో నిందితుడైన సౌదీ రాజ కుటుంబ సభ్యుడిని ఉరి తీశారు. అదెల్‌ అల్‌ మహ్మ ద్‌ అనే వ్యక్తిని కాల్చి చంపిన సౌదీ యువరాజు టర్కిబిన్‌ సౌద్‌ అల్‌ కబీర్‌కు మంగళవారం రియాద్‌లో ఈ శిక్ష అమలు చేశారు. దీంతో సౌదీలో ఈ ఏడాది మరణశిక్ష అమలు చేసిన వారి సంఖ్య 134కి చేరింది. కాగా, రాజ కుటుంబ సభ్యుడిని ఉరి తీయడం సౌదీలో అరుదైన ఘటనగా నిల్చింది. మిత్రుడితో ఘర్షణ పడిన సౌదీ యువరాజు అల్‌ కబీర్‌, 2012లో అతడిని కాల్చి చంపాడు.

No comments:

Post a Comment