Saturday, October 22, 2016

నిన్న దేవుళ్ళు... నేడు హైకమాండ్...వారేవా...బాబు

ప్రజలే నా హైకమాండ్; వారు చెప్పిందే చేస్తాన్నంటున్న సియం చంద్రబాబు



రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్‌ అని.. వారి కంటే తనకు ఎవరూ ముఖ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కాపుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని... పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన కాపు జాబ్‌మేళాకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన యువతకు ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాపు భవన్‌కు నిధులు ఇచ్చామని.. కాపు విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దృఢసంకల్పం ఉంటే సాధించలేని ఏదీ లేదన్నారు. 

No comments:

Post a Comment