Wednesday, October 19, 2016

మీరే దేవుళ్ళు, మిమ్మల్ని మర్చిపోనంటున్న బాబు

జెండా మోసిన వారిని మర్చిపోను; ఇకపై పార్టీకోసం 3గంటలు ; చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను ఎన్నటికీ మర్చిపోయేదిలేదని, ఇక పై పార్టీకోసం రోజుకు 3గంటల సమయం కేటాయిస్తానని ఎపిసియం,టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని ఎపి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తొలిసారిగా ఆయన సందర్శించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సియం ఆవిష్కరించారు. రాజకీయాలకు నూతన నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. టీడీపీ వేసిన పునాదుల వల్లే నేడు హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు వచ్చిందని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, అన్ని సమస్యలను అధిగమించి రాజధానిని నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

No comments:

Post a Comment