Friday, October 21, 2016

టిడిపి మాచర్ల మజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి అత్మహత్య

మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి అత్మహత్య; గుంటూరు జిల్లాలో విషాదం



మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ గోపవరపు శ్రీదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో విషాదాన్ని నింపింది, చిన్న వయస్సులో మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేసి శ్రీదేవి అందరి మన్ననలు అందుకున్నారు. నాలుగు మాసాల క్రితం శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతిచెందాడు. మాచర్లలో  తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం భార్యభర్తలిద్దరు కృషిచేశారు. పార్టీకోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేశారు. భర్త మృతి తరువాత శ్రీదేవి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీనేతలు , ఆతరువాత మొఖం చాటేయటంతో గతకొద్ది రోజులుగా అర్ధికపరంగా  ఆకుటుంబం ఇబ్బందులు  ఎదుర్కొంటుంది. ఒకవైపు భర్త చనిపోవటం, మరోవైపు అండగా నిలుస్తానన్న తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవటంతో శ్రీదేవి గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న శ్రీదేవిని మాచర్ల నుండి పిడుగురాళ్ళ అసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. 

No comments:

Post a Comment