Saturday, October 22, 2016

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయాలు; కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అఖిలేష్



ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల ప్రకటించటం, బాబాయ్ శివ్‌పాల్‌తో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సీఎం అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేశ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 5న పార్టీ రజతోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. 3నుంచి ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. ఇవన్నీ పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలను బలపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎస్పీ ముఖ్యనేతలతో శుక్రవారం జరిగిన సమావేశానికి అఖిలేశ్ గైర్హాజరయ్యారు. ఈ భేటీ పూర్తయ్యాక ఆ నాయకులతోనే సీఎం తన నివాసంలో వేరుగా సమావేశమై నవంబర్ 3నుంచి జరగనున్న ‘వికాస్ రథయాత్ర’ గురించి మాట్లాడారు. అఖిలేశ్ కొత్త పార్టీ యత్నాలపై వార్తల నేపథ్యంలో.. ఎస్పీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment