Thursday, October 20, 2016

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సియం అభ్యర్ధి మాజీ క్రికెటర్ సిద్ధూ!

పంజాబ్ కాంగ్రెస్ సియం అభ్యర్ధి సిద్ధూ; ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు హస్తం పార్టీ సరికొత్త ప్రయోగం!


పంజాబ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ తహతహలాడుతుంది. సర్వేలన్నీ కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రచార వ్యూహాంలో మార్పులు చేర్పులు చేస్తుంది. దీనిలో భాగంగానే మాజీ క్రికెటర్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు, భాజపా నుంచి వైదొలగిన నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూని తమతో చేతులు కలపమని ఆహ్వానిస్తోంది. ఎన్నికల్లో తమతో చేతులు కలిపితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ సిద్ధూకి ఆశ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధూ ఇటీవలే మరికొందరితో కలిసి ఆవాజ్‌-ఈ-పంజాబ్‌ అనే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధూకి కాంగ్రెస్‌ ఆఫర్‌ పట్ల ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్‌సింగ్‌ అంత సంతోషంగా లేరు. సిద్ధూ తన ఆవాజ్‌-ఈ-పంజాబ్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్నది ఆయన అభిమతం. ఈ విషయమే ఆయన సిద్ధూకి సూచించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్‌ పేరును అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ప్రచారం అంతా ఆయన సారథ్యంలోనే సాగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

No comments:

Post a Comment