Friday, October 21, 2016

పాకిస్తాన్ తో క్రికెట్ అడేదే లేదంటున్న గంగూలీ

గంభీర్ కు బాసటగా నిలిచిన గంగూలీ; పాకిస్తాన్ తో అడేదిలేదు


పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడటం గురించి గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలకు టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ మద్దతు పలికారు. ‘భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, సరిహద్దుల్లో మన దేశ సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇలాంటి సమయంలో వారితో క్రికెట్‌ ఆడటం సబబు కాదని’ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది చాలా సున్నితమైన విషయం.. దీనిపై అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ వైఖరి వేరేలా ఉండొచ్చుని’ అన్నారు. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే భారత్‌, పాక్‌ల మ్యాచ్‌ల విషయం బీసీసీఐ పరిధిలోకి రాదని క్యాబ్‌ అధ్యక్షుడు గుంగూలీ వెల్లడించారు. 


No comments:

Post a Comment