Wednesday, October 19, 2016

బర్డ్ ఫ్లూ భయంతో ఢిల్లీ జూ మూసివేత

ఢిల్లీలో బర్డ్ ఫ్లూ భయం



దేశ రాజధాని దిల్లీని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ భయంతో ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శనశాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జూలోని 9 పక్షులు బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయాయి. వీటిని పరీక్షించిన వైద్యులు ప్రమాదకరమైన హెచ్‌-5 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్‌ పర్యాటకులకు సోకే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు జంతు ప్రదర్శనశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

No comments:

Post a Comment